News November 30, 2025

మహారాష్ట్ర సరిహద్దులో రైలు ఢీకొని పులి మృతి

image

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మాణిగ్గర్–విర్గాం సమీపంలో రైలుప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం సిర్పూర్ శివారులో రైలు ఢీకొనడంతో పులి అక్కడికక్కడే మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించామన్నారు. పులి ట్రాక్‌పైకి ఎలా చేరిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Similar News

News February 7, 2026

9th విద్యార్థులకు మార్చిలోనే టెన్త్ పాఠాలు

image

AP: వచ్చే విద్యాసంవత్సరంలో 6-8 క్లాసుల సిలబస్, ఆ తర్వాతి ఏడాది 9,10 తరగతుల పాఠ్యాంశాలు మారతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా జూన్‌లో టీచర్లకు శిక్షణకు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి స్టూడెంట్లకు టెన్త్ పాఠాలు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై దృష్టిపెట్టాలని ఆదేశించింది.

News February 7, 2026

సకల దోష నివారణ మార్గం ‘సూర్య గ్రహ శాంతి’

image

జాతకంలో సూర్య దోషాలు ఉన్నవారు, సూర్య మహాదశ నడుస్తున్న వారు భాను సప్తమి నాడు సూర్య గ్రహ శాంతి పూజ, యజ్ఞం నిర్వహించడం శుభప్రదం. సూర్యుడు జాతకంలో ఆత్మకారకుడు, అధికారానికి చిహ్నం. ఈ రోజున చేసే జపం, హోమం వల్ల ప్రతికూల ప్రభావాలు తొలగి, సమాజంలో గౌరవం, వృత్తిలో విజయం లభిస్తాయి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా జాతకంలోని రవి నీచ స్థితి, గ్రహణ దోషాలు హరించుకుపోతాయి. జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి.

News February 7, 2026

జామలో తెల్ల సుడిదోమ వల్ల నష్టాలు – నివారణ

image

తెల్ల సుడిదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లను పెడతాయి. ఆకులపై తెల్లని దూదిలాంటి మెత్తని పదార్ధాన్ని కప్పి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ఎర్రబడి, ముడతలు పడి రాలిపోతాయి. వీటి నివారణకు రాత్రివేళ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను చెట్ల వద్ద ఉంచాలి. సుడిదోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి లీటరు నీటిలో 5ml వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్-75% WGని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.