News February 26, 2025

మహాశివరాత్రి.. రామప్పలో నేటి కార్యక్రమాలు ఇవే

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం స్వామివారికి అభిషేకాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటలకు స్వామి వారి కళ్యాణం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరగనున్నాయి. రోజంతా నిత్య పూజలతో పాటు, జాగరణ, సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు ఏర్పాటు చేశారు.

Similar News

News March 15, 2025

ఇవాళ అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

image

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఇవాళ తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.

News March 15, 2025

జనం ఛీ కొట్టినా.. జగన్ మారట్లేదు: మంత్రి లోకేశ్

image

AP: వైసీపీ రాక్ష‌స మూక‌ల దాడిలో మృతిచెందిన‌ చిత్తూరు(D) కృష్ణాపురానికి చెందిన TDP కార్యకర్త రామకృష్ణకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ దాడిలో గాయ‌ప‌డిన రామ‌కృష్ణ కుమారుడు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. జనం ఛీ కొట్టినా మాజీ CM జగన్ హ‌త్యా రాజ‌కీయాలు మాన‌డం లేదని మండిపడ్డారు. YCP ర‌క్త‌చ‌రిత్ర‌కు TDP సైనికుడిని కోల్పోవ‌డం చాలా బాధాకరమన్నారు.

News March 15, 2025

జనసేనను బీజేపీలో విలీనం చేయడం మంచిది: తులసి రెడ్డి

image

జనసేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి పవన్ కళ్యాణ్‌కు సూచించారు. శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మొదటి నుంచి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ల ముగ్గురూ కీలు బొమ్మలని అన్నారు. అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందన్నారు.

error: Content is protected !!