News January 19, 2026
మహిళల భద్రతకు అగ్రపీఠం: జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లాలో మహిళలు, చిన్నారుల భద్రతను పటిష్టం చేయాలని ఎస్పీ పి.జగదీష్ గ్రామ, వార్డు మహిళా పోలీసులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మహిళా పోలీసులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ భరోసా కల్పించాలని సూచించారు. వేధింపులు జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
Similar News
News February 14, 2026
ముచ్చటగా మూడోసారి..

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఒటాన్ అకౌంట్, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన 2026-27 ఆర్థిక సంవత్సరానికి శనివారం ఉదయం 11:15 గంటలకు అసెంబ్లీలో సమగ్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి-సంక్షేమానికి సమతూకం కల్పించేలా రూపకల్పన చేసినట్లు సమాచారం. సీఎం మార్గనిర్దేశంతో, పది రోజుల ప్రీ-బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ బడ్జెట్ సిద్ధమైంది.
News February 14, 2026
అనంతపురం జిల్లాకు బడ్జెట్ కేటాయింపులపై ఉత్కంఠ

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన రెండోసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుండటం విశేషం. జిల్లాకు చెందిన మంత్రి కావడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కీలక ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News February 14, 2026
అనంతపురం: ‘మాతా, శిశు మరణాలు నివారించాలి’

అనంతపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా జరగరాదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో అక్టోబర్, డిసెంబర్-2025 త్రైమాసిక సమీక్షలో 6 మాతృ మరణాలపై కూలంకషంగా చర్చించారు. నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు పూర్తి పర్యవేక్షణ, టీనేజ్ గర్భధారణ నియంత్రణ, మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన కల్పించాలన్నారు.


