News January 27, 2025

మాజీ డిప్యూటీ స్పీకర్‌ను పరామర్శించిన పటాన్‌చెరు MLA

image

ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి, తెలంగాణ మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ శాసన సభ్యుడు పద్మారావు గౌడ్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. భగవంతుడి కృపతో అతి త్వరగా కోలుకొని ప్రజా సేవలో పాల్గొనాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 13, 2025

కాంగ్రెస్ వాళ్లపై పింక్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నాం: MLC కవిత

image

తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న అరాచకాల్ని పింక్ బుక్‌లో నోట్ చేసుకుంటున్నామని BRS ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం కక్షపూరితంగా మా కార్యకర్తలపై కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా విమర్శలకు కూడా CM భయపడుతున్నారు. పోస్టు పెట్టిన తర్వాతి రోజే పోలీసులు ఇంటికొచ్చి వేధిస్తున్నారు. మీ లెక్కలన్నీ తేలుస్తాం’ అని హెచ్చరించారు.

News February 13, 2025

యూట్యూబర్‌ను అన్‌ఫాలో చేసిన కోహ్లీ, యూవీ

image

యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో క్రికెటర్లు విరాట్ కోహ్లీ, యువరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరు ఇప్పటివరకూ ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్‌వీర్‌ను ఫాలో అవుతుండగా తాజాగా అన్‌ఫాలో చేశారు. ఇలాంటి వ్యక్తులను ఫాలో అవ్వకపోవడమే కరెక్ట్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు. మరికొందరు సెలబ్రిటీలు కూడా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

News February 13, 2025

ఆసియాలో రిచెస్ట్ ఫ్యామిలీ ఎవరిదంటే?

image

ఆసియాలోనే టాప్-20 అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో 6 భారత్‌కు చెందినవేనని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ₹7.86L Cr సంపదతో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. 4,7,9,13,18 స్థానాల్లో వరుసగా మిస్త్రీ(₹3.25L Cr), జిందాల్(₹2.44L Cr), బిర్లా(₹1.99L Cr), బజాజ్(₹1.74L Cr), హిందూజా(₹1.32L Cr) కుటుంబాలు ఉన్నాయి. 2,3, స్థానాల్లో చీరావనోండ్-థాయ్‌లాండ్(₹3.70L Cr), హర్టోనో-ఇండోనేషియా(₹3.66L Cr) నిలిచాయి.

error: Content is protected !!