News June 17, 2024

మాజీ మంత్రి వేణుగోపాల్‌పై మంత్రి సుభాశ్ ఆరోపణలు

image

మంత్రి వాసంశెట్టి సుభాశ్ మాజీ మంత్రి వేణుగోపాల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ద్రాక్షారామలో నేడు ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటికి సంబంధించి తమ వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని అన్నారు. అవినీతి, అక్రమాలను తర్వలోనే బయటకు తీసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News January 20, 2026

22న రాజమండ్రిలో జాబ్ మేళా

image

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై, 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీలు ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 20, 2026

తూ.గో: వరకట్న వేధింపులు.. భర్తకు 18 నెలల జైలు శిక్ష

image

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి కరిముల్లాకు 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ వీరరాఘవరావు మంగళవారం తీర్పునిచ్చారు. ధవళేశ్వరానికి చెందిన సయ్యద్ సమీన తబసుమ్‌ను అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో 2012లో రాజమహేంద్రవరం మహిళా పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది.

News January 20, 2026

27న PDS బియ్యం బహిరంగ వేలం

image

తూర్పుగోదావరి జిల్లాలో 6-A కేసుల కింద స్వాధీనం చేసుకున్న 3335.828 క్వింటాళ్ల PDS బియ్యాన్ని బహిరంగ వేలం వేయనున్నట్లు కలెక్టర్ వై.మేఘా స్వరూప్ మంగళవారం తెలిపారు. జనవరి 28న కలెక్టరేట్ వద్ద ఈ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు జనవరి 27న కార్యాలయంలో ఉంచిన బియ్యం నమూనాలను పరిశీలించవచ్చని సూచించారు. నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొని బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.