News September 11, 2025
మార్టూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి స్వాధీనం

RTC బస్సులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం-తిరుపతి వెళుతున్న RTC బస్సును అధికారులు మార్టూరు మండలం బొల్లాపల్లి యవ తనిఖీ చేశారు. ఒరిస్సాకు చెందిన సురేష్ మహాపాత్ర 5 కిలోల గంజాయిని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. ఇతనిపై గతంలో తమిళనాడులో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News December 5, 2025
సిద్దిపేట: కలెక్టర్ను కలిసిన స్వయం సహాయక సభ్యులు

స్వయం సహాయక సంఘా సభ్యులు Event Management పై National Institute of Tourism and Hospitality Management(NITHM) హైదరాబాద్లో 5 రోజులు పాటు శిక్షణ తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా నుంచి ఆరుగురు స్వయం సహాయక సభ్యులు బాలలక్ష్మి, మంజుల, శ్వేతాకళ, భూలక్ష్మి, శిరీష, లావణ్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించి పలు రకాల యూనిట్లకు శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ వారికి అభినందనలు తెలిపారు.
News December 5, 2025
సిద్దిపేట: ఉమిద్ పోర్టల్లో ఆస్తుల నమోదు

ఉమిద్ పోర్టల్లో ఎండోమెంట్ ఆస్తుల నమోదును ప్రక్రియ సిద్దిపేట జిల్లా జమియత్ ఉలేమా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉమిద్ పోర్టల్పై నెల రోజుల నుంచి సిద్ధిపేట అధ్యక్షుడు ముఫ్తీ అబ్దుల్ సలాం ఖాస్మి చుట్టుపక్కల మండలాల ప్రజల్లో అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు మండలాల యువత, నాయకులు తమ వద్ద ఉన్న వక్ఫ్ ఆస్తి పత్రాలను పోర్టల్లో నమోదు చేశారు.
News December 5, 2025
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.


