News February 18, 2025

మాల మహానాడు ఉమ్మడి జిల్లాల విస్తృత సమావేశాలు

image

మాలమహానాడు ఉమ్మడి జిల్లాల విస్తృత సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల విస్తృత సమావేశం ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా ఉమ్మడి జిల్లాలకు కూడా విస్తృత సమావేశ తేదీలను నాయకులు తెలిపారు.

Similar News

News March 13, 2026

SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

image

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.

News March 13, 2026

పరీక్షల్లో అప్రమత్తత అవసరం: డీఈఓ లలిత

image

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు డీఈఓ లలిత తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 6,949 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్, OMR షీట్ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదువుకున్న తర్వాతే సమాధానాలు రాయాలని, ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

News March 13, 2026

నిర్మల్: ‘గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి’

image

నిర్మల్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ భోజన్న సూచించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా సకాలంలో హాజరుకావాలన్నారు. ఈసారి ‘నిమిషం నిబంధన’ అమలులో లేదని, 9.35 నిమిషాల వరకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, 9.30 గంటలకే విద్యార్థులు తమ గదుల్లో ఉండాలని ఆయన ఆదేశించారు.