News May 4, 2024
మినీ ఇండియా.. మల్కాజిగిరిలో గెలుపెవరిది?

దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓ మినీ ఇండియా లాంటిది. దాదాపు 40 లక్షల వరకు ఓటర్లు ఉన్న పార్లమెంట్ స్థానంలో BRS, కాంగ్రెస్, BJP మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కార్నర్ మీటింగ్స్, గడపగడపకు ప్రచారం, రోడ్డు షోలతో ముందుకు వెళ్తున్నారు. BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతామహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉండగా ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
Similar News
News December 8, 2025
HYD: 2 రోజుల కోసం 2 నెలలుగా ప్రత్యేక దృష్టి

నేడు, రేపు ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి 2 నెలల ముందునుంచే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిత్యం సమీక్షలు, ఏర్పాట్లు, అతిథులు, ఆహ్వానాలు.. ఇలా అన్నింటిని తానే నడిపించారు. ఎక్కడా.. పొరపాట్లు దొర్లకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాహుల్ గాంధీని ఆహ్వానించారు. వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనేది సీఎం ఆశయం.
News December 8, 2025
సీఎం సరికొత్త ఆలోచన.. HYDలో డొనాల్డ్ ట్రంప్ రోడ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఇపుడు హైదరాబాద్లోని ఓ రోడ్డుకు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సిటీలోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ వద్ద ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని కేంద్రానికి, యూఎస్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు సమాచారం.
News December 8, 2025
HYDలో అక్కడ ఒక్క రూపాయికే టిఫిన్

HYDలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో భోజనం కోసం బిక్కు బిక్కుమంటూ తిరిగే వాళ్లెందరో. అలాంటి వారిని చూసి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ‘కరుణ కిచెన్’ జార్జ్ రాకేశ్బాబు రూపాయికే టిఫిన్ పెడుతున్నట్లు తెలిపారు. రోజూ మెనూ ఛేంజ్ చేస్తూ దాదాపు 300 మంది కడుపు నింపుతున్నారు. ఉ.7 గం.- 9 గం. వరకు 2 గంటలు కొనసాగుతోంది. ‘డబ్బు కోసం కాదు.. నలుగురి కడుపు నింపేందుకు. ఇందులోనే నా సంతోషం ఉంది’ అని తెలిపారు.


