News March 27, 2024
మిర్యాలగూడ : హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు..?

మిర్యాలగూడ పట్టణంలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తోంది. మూడు ఇళ్లపై బుధవారం పోలీసులు దాడి చేసి పదిమంది మహిళలతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో అనుమానాస్పద ఇండ్లలో తనిఖీలు చేసి 11 మందిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. దీని వెనుక ఉన్న సూత్ర, పాత్రధారులు ఎవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
Similar News
News February 13, 2026
నల్గొండలో విషాదం.. డీసీఎం ఢీకొని కానిస్టేబుల్ మృతి

చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనపల్లి సమీపంలో వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో మునుగోడు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ (34) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల విధులను ముగించుకుని నకిరేకల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జయింది.
News February 13, 2026
మిర్యాలగూడలో ఒక్క ఓటుతో విజయం

మిర్యాలగూడ 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు సంచలన విజయం సాధించారు. అత్యంత హోరాహోరీగా సాగిన కౌంటింగ్లో సైదులుకు 837 ఓట్లు రాగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ ఉత్కంఠ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని సైదులు కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
దేవరకొండ: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను 11 స్థానాలను గెలుచుకుని, స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 6 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ కేవలం ఒక వార్డులో మాత్రమే విజయం సాధించింది. ఓటర్లు మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.


