News September 9, 2025

మునిపల్లి: గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై ఎస్పీ పారితోష్ పంకజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఘటన స్థలాన్ని పరిశీలించి హాస్టల్ విద్యార్థులను తాత్కాలికంగా వేరే ప్రాంతానికి తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రిలో పరామర్శించారు.

Similar News

News December 12, 2025

కామారెడ్డి: NCC విద్యార్థిని అభినందించిన ఎస్పీ

image

భిక్కనూర్ మండలం మాందాపూర్ కౌంటింగ్ సెంటర్‌లో విధుల్లో ఉన్న NCC విద్యార్థితో KMR ఎస్పీ రాజేష్ చంద్ర ఆప్యాయంగా మాట్లాడారు. ఇది తన మొదటి డ్యూటీ అని విద్యార్థి చెప్పగా, అతని అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. అతనిలో ఉన్న నిబద్ధత ఉత్సాహం పట్ల SP అభినందించారు. మంచి స్ఫూర్తితో పని చేస్తున్నందుకు ధైర్యం, ఉత్సాహం నింపుతూ విద్యార్థిని మెచ్చుకున్నారు.

News December 12, 2025

ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

image

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వక‌పోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.

News December 12, 2025

సిద్దిపేట: యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌ సభ్యుడిగా శనిగరం వాసి

image

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు ఇంగ్లాండ్ రాజు ఈ నామినేషన్ చేశారు. గతంలో లేబర్ పార్టీ అభ్యర్థిగా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నాగరాజు.. శనిగరానికి చెందిన హనుమంతరావు, నిర్మల దేవి దంపతుల కుమారుడు.