News February 8, 2025

ములకలచెరువు ప్రమాదంలో మరొకరు మృతి

image

ములకలచెరువులో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని SI నరసింహుడు తెలిపారు. మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన సోమశేఖర్ భార్య కవిత, కొడుకు రెడ్డిశేఖర్(5), కుమార్తె సిద్దేశ్వరి కదిరిలో బంధువుల అంత్యక్రియలకు బైకుపై వెళ్తుండగా ములకలచెరువు వద్ద వాహనం ఢీకొట్టడంతో <<15397818>>తండ్రీ కుమార్తె చనిపోగా<<>>, భార్య, కుమారుడిని చికిత్త నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే రెడ్డిశేఖర్ చనిపోయాడు.

Similar News

News February 19, 2026

పోలీసులపై అంబటి రాంబాబు ఆగ్రహం

image

AP: నిన్న జైలు నుంచి విడుదలైన YCP నేత అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ఊరేగింపుగా వెళ్లొద్దని తెలిపారు. దీనిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటీ నిర్బంధాలు? నేనేమైనా ర్యాలీ తీస్తున్నానా? ఆంక్షలు ఎందుకు? 10 మంది కార్యకర్తలు వచ్చి నన్ను పలకరించడం తప్పా?’ అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు.

News February 19, 2026

అమలాపురం: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు 40 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె.చంద్రశేఖర్ బాబు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 13,131 మంది, ద్వితీయ సంవత్సరంలో 12,887 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యతను చీఫ్ సూపర్‌వైజర్లు, అధికారులే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

News February 19, 2026

GNT: నిధుల వినియోగంపై ఆంక్షలు.. సర్పంచుల ఆవేదన

image

ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న వేళ గ్రామాల్లో పనుల బిల్లులపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.70 కోట్లు ఉన్నా వాటిని విద్యుత్ బిల్లులు, చెత్త నిర్వహణకే పరిమితం చేశారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచులు అంటున్నారు. ఇప్పటికే చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షలు సడలించాలని అంటున్నారు.