News March 5, 2025
ములుగు: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

నేడు ములుగు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదని తెలిపారు.
Similar News
News December 17, 2025
సిద్దిపేట జిల్లాలో పోలింగ్ START

సిద్దిపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. జిల్లాలోని 163పంచాయతీలకు 13 ఏకగ్రీవమవగా మిగితా 150గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News December 17, 2025
మెదక్: రుణదాతల వేధింపులతో వ్యక్తి సూసైడ్

అప్పు ఇచ్చినవారు వేధించడంతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని కువత్ ఇస్లాంకు చెందిన మహమ్మద్ షాదుల్లా హుస్సేన్ (45) పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సమీపంలో టీ స్టాల్ నడుపుతూ జీవిస్తున్నాడు. రూ.30 లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు వేధించడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫాతిమా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 17, 2025
GNT: అలర్ట్.. PG సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడంటే.!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో FEBలో నిర్వహించనున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలు FEB 10 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. విద్యార్థులు JAN 1వ తేదీలోగా అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. LLB పరీక్షల షెడ్యూలు కూడా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in సంప్రదించవచ్చు.


