News December 5, 2024
ములుగు ఎన్కౌంటర్ బూటకం: ప్రొ. హరగోపాల్

డిసెంబర్ 1న ఏటూరు నాగారం చల్వాక ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టులపై విషహారం ప్రయోగించి, బంధించి, హింసించి చేసిన హత్యాకాండే అని తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొ. హరగోపాల్ ఆరోపించారు. NSSలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మార్చి 2026 వరకు నక్సలైట్లను ఏరివేస్తామని స్వయంగా హోం మంత్రి అమిత్షా ప్రకటించారని, అందులో భాగంగానే బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. నారాయణ రావు ఉన్నారు.
Similar News
News February 9, 2026
HYD: ఖాతాలోకి పైసలు.. కానీ గుండెల్లో రైళ్లు!

కార్పొరేట్ ఆట కట్టించేందుకు సర్కారు ‘DBT’ అస్త్రం విసిరింది. “నీ ఫీజు నీ చేతికే” అంటున్న.. ఏదో తిరకాసు ఉందని టాక్. గ్రేటర్లోని 3.5 లక్షల మంది పేద విద్యార్థులకు నిధులు టైముకు రాకపోతే గతేంటి? గతంలో కాలేజీలు సర్కారు కోసం ఎదురుచూసేవి, ఇప్పుడు విద్యార్థులే మేనేజ్మెంట్ల ముందు నిలబడాల్సిన పరిస్థితి. ఈ పద్ధతి కాలేజీలను దారికి తెస్తుందా?, విద్యార్థులను అప్పుల ఊబిలో ముంచుతుందా! అనేది చర్చనీయాంశమైంది.
News February 9, 2026
GHMC 3 ముక్కలు.. బాస్ ఆయనే!

GHMCని 3 ముక్కలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. HYD, CYB, మల్కాజిగిరి వేర్వేరు కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. ‘స్పెషల్ ఆఫీసర్’గా Special CS జయేశ్ రంజన్ను రంగంలోకి దించుతోంది. సైబరాబాద్ కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు వినయ్ కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ ప్రధాన కమిషనర్గా RV కర్ణన్ చక్రం తిప్పనున్నారు. రేపు GO విడుదల కానుందని సమాచారం.
News February 9, 2026
HYDలో బండిపోతే ‘బండి’.. ఏమైంది బండి?: CM

నగరంలో వరదలు వస్తే లోతట్టు ఇళ్లు, వాహనాలు మునిగిపోతాయని CM రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వరదల సమస్యను ప్రచారంలో వాడుకున్న బండి సంజయ్ గత GHMC ఎన్నికల్లో దాదాపు 50 మందిని గెలిపించుకున్నారని పేర్కొన్నారు. కానీ, ‘బండి పోతే బండి ఇస్తాం’ అన్న సంజయ్ ఆ హామీని నీరు గార్చారని, BJPకి ఓటేస్తే హైదరాబాదీలను నిండా ముంచారని రేవంత్ తీవ్రంగా విమర్శించారు.


