News August 21, 2025
ములుగు: ఏటూరునాగారంలో రెండవ ప్రమాద హెచ్చరిక

ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 75 కుటుంబాలకు చెందిన 216 మందిని తరలించామని పేర్కొన్నారు. నదీ తీర ప్రాంతాలకు వెళ్లరాదని, వరద నీటిలో ప్రయాణాలు చేయోద్దని ఆయన సూచించారు.
Similar News
News January 15, 2026
కనుమ నాడు గోవులకు పూజ ఎందుకు చేస్తారు?

కనుమ అంటేనే పశువుల పండుగ. అవి ఏడాదంతా పొలం పనుల్లో రైతుకు చేదోడువాదోడుగా ఉంటాయి. పంట చేతికి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు కృతజ్ఞతగా నేడు వాటిని పూజిస్తాం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలురను రక్షించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గోపూజ సంప్రదాయం మొదలైంది. ఆవును జంతువుగా మాత్రమే కాకుండా ప్రకృతికి, జీవనాధారానికి ప్రతీకగా భావిస్తారు. ఆవును గౌరవించడం మన సంస్కృతిలో భాగం.
News January 15, 2026
అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.
News January 15, 2026
53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి వైపు ప్రయాణం

53 ఏళ్ల తర్వాత మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు చేరనున్నారు. నాసా ‘ఆర్టెమిస్-2’ మిషన్లో నలుగురు వ్యోమగాములు రీడ్ వైజ్మేన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ వచ్చే నెల 6న ప్రారంభమై 10 రోజులపాటు చంద్రుని చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి వస్తారు. 1972లో చేపట్టిన అపోలో తర్వాత తొలి మానవ సహిత మిషన్ ఇది. ఆర్టెమిస్-3 ద్వారా మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లనున్నారు.


