News September 12, 2025

ములుగు: కామారెడ్డి సభతో కేంద్రంపై శంకరావం: సీతక్క

image

ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బీసీ డిక్లరేషన్ సభతో కేంద్ర ప్రభుత్వంపై శంఖారావం పూరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు.

Similar News

News December 11, 2025

‘అఖండ-2’ విడుదల: దెబ్బ మీద దెబ్బ

image

‘అఖండ-2’ సినిమాకు వరుస అడ్డంకులు ఎదురవుతుండటం నిర్మాతలు, ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. డిస్ట్రిబ్యూటర్ ఆర్థిక లావాదేవీల <<18474420>>సమస్యతో<<>> ఈ నెల 5న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. తాజాగా ప్రీమియర్ షో టికెట్ల ధర పెంపు జీవోను TG హైకోర్టు సస్పెండ్ చేయడంతో అదనపు ఆదాయం పొందాలనుకున్న నిర్మాత ఆశలు అడుగంటాయి. కాగా ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి రిఫండ్ అవుతుందా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

News December 11, 2025

5 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు

image

SIR గడువు వారం రోజులు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత CEOల వినతులతో గడువు పొడిగించినట్టు తెలిపింది. యూపీ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్‌లో మరో వారంపాటు SIR కొనసాగనుంది. కాగా గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, వెస్ట్‌ బెంగాల్‌లో ఈరోజుతో SIR ముగియగా DEC 16న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ కానుంది.

News December 11, 2025

కోస్గి: విజయోత్సవ ర్యాలీలు నిషేధం

image

నారాయణపేట జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు (ఈ నెల 17 వరకు) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరిగిన గ్రామాల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఆయన ప్రకటించారు.