News March 10, 2025
ములుగు జిల్లాకు రేపు గవర్నర్ రాక!

ములుగు జిల్లాలో రేపు (మంగళవారం)రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటించనున్నారు. తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని ఇటీవల గవర్నర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కాగా గ్రామంలో పలు రకాల అభివృద్ధి పనులను అధికారులు చేపట్టారు. గ్రామపంచాయతీ, రోడ్లు, గ్రామాభివృద్ధికి సంబంధించి వివిధ రకాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఆ పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 9, 2026
కోరుట్ల: డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన ఆర్టీసీ డ్రైవర్

మద్యం తాగి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం సాయంత్రం బెల్లంపల్లి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ జక్కుల మల్లేశ్ను పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మజారుద్దీన్ తెలిపారు.
News February 9, 2026
పాపం.. ఇషాన్ కిషన్!

దేశవాళీ ప్రదర్శనతో T20 WC జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్పై BCCI దయ చూపలేదు. తాజాగా రిలీజ్ చేసిన <<19095739>>సెంట్రల్ కాంట్రాక్ట్<<>> లిస్టులో అతనికి చోటు కల్పించలేదు. దీంతో కిషన్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రంజీల్లో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం, దేశవాళీ క్రికెట్ను నిర్లక్ష్యం చేశారని 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇతనితో పాటు శ్రేయస్ను BCCI తొలగించింది. అయితే తాజా లిస్టులో అయ్యర్ గ్రేడ్-Bలో ఉన్నారు.
News February 9, 2026
నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

TDP లో సమిష్టి న్యాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.


