News September 13, 2025
ములుగు: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 91 మందికి జరిమానా

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 91 మందికి ములుగు కోర్టు జరిమానా విధించిందని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 85 మందికి రూ.1,68,000 జరిమానా, ఆరుగురికి రెండు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.12000 జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 13, 2025
ఖమ్మం: క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిశీలించిన సీపీ

ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. రూరల్ మండలంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,059 కేసుల్లో 7,129 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>


