News December 1, 2025

ములుగు: పంతాలు, పట్టింపులు లేవు.. అన్నీ పంపకాలే..!?

image

ఉప్పు నిప్పులా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీలు పల్లెపోరులో పంతం వదులుతున్నాయి. నిన్నటి దాకా ఎదురుపడితే బుసలు కొట్టుకున్న నాయకులు సంధి రాజకీయాలు చేస్తున్నారు. సర్పంచ్, వార్డులను మీకిన్ని.. మాకిన్ని.. అంటూ పంచుకుంటున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన పంచాయతీల్లో ఈ పంపకాలు జోరందుకున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా నేతలు ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణ లోపు కొలిక్కి తెచ్చేలా మంతనాలు సాగిస్తున్నారు.

Similar News

News February 12, 2026

కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా?

image

కళ్లజోడు ముఖానికి సరిపోదనో, కళ్ల రంగు మారిస్తే ఫ్యాషన్ అనో చాలామంది అమ్మాయిలు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. వీటిని సరిగా శుభ్రం చేయకపోయినా, వాడటంలో అజాగ్రత్తగా ఉన్నా కళ్లు పొడిబారటం, కార్నియా దెబ్బతినడం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి స్టైల్‌తో పాటు ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.

News February 12, 2026

నిర్మల్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు ‘తడిసి మోపెడు’

image

నిర్మల్ జిల్లాలోని 80 వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు భారంగా మారింది. గెలుపు కోసం ఫ్లెక్సీలు, ప్రచారం, మద్యం పంపిణీతో పాటు ఓటుకు నోటు ఇవ్వడంతో ఖర్చు భారీగా పెరిగింది. అధికారులకు చూపే లెక్కలు ఒకలా ఉంటే, క్షేత్రస్థాయిలో అభ్యర్థులు చేసిన వాస్తవ వ్యయం మరోలా ఉండటం గమనార్హం. ఎలాగైనా కౌన్సిలర్‌గా గెలవాలన్న పట్టుదలతో అభ్యర్థులు తమ శక్తికి మించి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

News February 12, 2026

బలిమెల నీటి వినియోగంపై ఆంధ్రా-ఒడిస్సా జెన్‌కో అధికారుల సమీక్ష

image

ఆంధ్ర, ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగం, నిర్వహణపై ఇరు రాష్ట్రాల అధికారులు సీలేరు జెన్‌కో అతిథి గృహంలో సమీక్షించారు. జ‌న‌వ‌రి నెల‌లో బ‌లిమెల జ‌లాశ‌యంలో నీటి వాడ‌కంపై చ‌ర్చించారు. దీని ప్రకారం ఆంధ్ర ఇప్పటి వరకు తన వాటాగా 28.39 టీఎంసీల నీటిని, ఒడిశా 58.28 టీఎంసీల నీటిని వినియోగించుకుంద‌ని నిర్ధారించారు. మిగిలిన వినియోగంపై చర్చించారు.