News March 11, 2025

ములుగు: మహిళలకు వడ్డీలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది: సీతక్క

image

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా రూ.10 లక్షల ప్రమాద భీమా చెల్లిస్తున్నామన్నారు. 400 మంది మహిళలకు రూ.40 కోట్లకు పైగా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.

Similar News

News February 9, 2026

KMR: ప్రధాన పార్టీల అగ్ర నాయకుల రాక లేమి!

image

ప్రచార పర్వం మొదల నుంచి ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు బారాస, భాజపా పార్టీ అగ్ర నేతలు ఎవ్వరు కూడా కామరెడ్డి మున్సిపాలిటీలో ప్రచారానికి రాలేదు. బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ లకు అన్ని పార్టీల అగ్రనేతలు వచ్చినప్పటికీ కామారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ మినహాయించి మిగతా పార్టీల అగ్ర నేతలు రాకపోవడం కొసమెరుపు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యతలు వారే తీసుకున్నట్లు అనిపిస్తోంది!

News February 9, 2026

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 83,957 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకొని 25,811 దగ్గర ట్రేడవుతోంది. అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ సూచీల్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్-30 సూచీలో SBI, కోటక్‌బ్యాంక్, టైటాన్, ఎటర్నల్, BEL షేర్లు లాభాల్లో.. పవర్‌గ్రిడ్, HUL, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News February 9, 2026

ములుగు: ఈరోజు సాయంత్రం వైన్ షాపులకు తాళం..!

image

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వైన్ షాపులకు తాళాలు పడనున్నాయి. 11న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి తెరుచుకుంటాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం డంప్ చేసుకున్నారు. ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. 48 గంటలు షాపులు మూతపడుతుండటంతో మద్యం ప్రియులు అప్రమత్తం అవుతున్నారు. తాగేందుకు, పంచేందుకు అవసరమైన స్టాక్ కొనుగోళ్లు ఈరోజు భారీగా జరగనున్నాయి.