News May 22, 2024
మూడు బంగారు మెడల్స్ అందుకున్న నెల్లూరు విద్యార్థి

జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటిలో బుధవారం స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరులోని వి.మాలకొండ రెడ్డి నగర్కు చెందిన చందన గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మూడు గోల్డ్ మెడల్స్ అందుకుంది. చందన 2021-22 బ్యాచ్లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. చందన మాట్లాడుతూ.. పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్గా రాణించాలన్నది తన ఆశయమన్నారు.
Similar News
News March 6, 2026
నెల్లూరు: మళ్లీ కొండెక్కిన ధర.. కేజీ రూ.320

జిల్లాలో చికెన్ ధరలు మరోసారి కొండెక్కాయి. వేసవిలో చికెన్ ధరలు తగ్గడం సహజం. అయితే అనూహ్యంగా మార్చిలో ధర పెరగడంతో మాంసం ప్రియులు షాక్కి గురవుతున్నారు. జనవరిలో పండుగల సందర్భంగా స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.350 ఉండగా అనంతరం ధరలు తగ్గు ముఖం పట్టాయి. మార్చి ప్రారంభం కాగానే మళ్లీ చికెన్ ధరలు అమాంతం పెరగడంతో మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 6, 2026
రాష్ట్రంలోనే కావలి టాప్

నెల్లూరు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కావలిలో నిన్న అత్యధికంగా 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు కంటే ఎక్కువ కాస్తుందని తెలిపారు. ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News March 6, 2026
నెల్లూరు: పదో తరగతి హాల్ టికెట్లో తప్పులు

రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన పదో తరగతి హాల్ టికెట్లో తప్పులు దొర్లినట్లు విద్యార్థులు తెలిపారు. మనుబోలు ZP హైస్కూల్లో చదువుతున్న వారికి పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పక్కనే ఉన్న ZP బాలికల హైస్కూల్ను కేటాయిస్తారు. అయితే ఈసారి హాల్ టికెట్లో ZP బాలికల హైస్కూల్ కేంద్రం కోడ్ను వేసి, పరీక్షా కేంద్రం పేరు ZP హైస్కూల్ అని వచ్చిందన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


