News December 2, 2025

‘మెగా పీటీఎం 3.O‌కు రూ.9.84 కోట్లు కేటాయింపు’

image

ఈనెల 5న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్ టీచర్ డే (పి.టి.ఎం 3.0) కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.84 కోట్లు కేటాయించింది. రాష్ట వ్యాప్తంగా 45,190 సర్కారు పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురం(D) భామిని ఏపీ మోడల్ స్కూల్లోని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు.

Similar News

News February 17, 2026

అమరావతి: ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళన

image

రెండు రోజుల విరామం తర్వాత ఉదయం 11 గంటలకు ఏపీ శాసనమండలి సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల నెయ్యి సరఫరాపై వాయిదా తీర్మానం ఇవ్వగా ఛైర్మన్ తిరస్కరించారు. దీనిపై ఆగ్రహంతో ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

News February 17, 2026

జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

image

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్‌ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్‌ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.

News February 17, 2026

సిద్దిపేట: మహిళా మణులకే పదవులు!

image

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వాయ్యాయి. దీంతో కీలకమైన పదవిలో 4 మహిళా మణులు బాధ్యతలు స్వీకరించారు. చేర్యాల మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా మేడిశెట్టి ఉమా, దుబ్బాక-ఆశ సులోచన, గజ్వేల్-ప్రజ్ఞాపూర్-కళ్యాణ్ కర్ పద్మాభాయి, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా చిత్తారి పద్మ పదవి చేపట్టారు. ఇక్కడ ఛైర్ పర్సన్‌లు కూడా మహిళలే.