News November 6, 2025
మెట్పల్లి: రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: అదనపు కలెక్టర్

మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ లత సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వాతావరణ మార్పు దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ అన్నారు. మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఎమ్మార్వో, ఏపీఎం, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
Similar News
News January 24, 2026
కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్!

ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్పై కాల్పులు జరిగిన ఘటనలో బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్(KRK)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైరింగ్ చేసిన తుపాకీని సీజ్ చేశారు. తన లైసెన్స్డ్ గన్ నుంచి తానే కాల్పులు జరిపినట్లు ఆయన ఒప్పుకున్నారు. గన్ని క్లీన్ చేశాక టెస్ట్ చేసేందుకు 4 రౌండ్స్ ఫైర్ చేసినట్లు తెలిపారు. జనవరి 18న ఘటన జరగ్గా పోలీసులు దర్యాప్తు చేసి ఫైరింగ్ జరిపింది KRKగా గుర్తించారు.
News January 24, 2026
రూ.52 కోట్ల జరిమానాపై సంతృప్తి: బాపట్ల MP

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అధికారులు పూర్తిగా అరికట్టాలని MP తెన్నేటి కృష్ణ ప్రసాద్ సూచించారు. గడిచిన మూడేళ్లలో అక్రమ తవ్వకాలపై రూ.52 కోట్లు జరిమానా విధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 3 మున్సిపాలిటీల్లో అమృత్-2 కింద నీటి ట్యాంకుల అభివృద్ధికి రూ.96.45 కోట్లు విడుదలయ్యాయన్నారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ శాఖ ద్వారా పనులకు టెండర్లు పిలువగా, టెండర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
News January 24, 2026
కాగజ్నగర్లో విషాదం.. భవానీ మృతి

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పరిధి భట్టుపల్లి గ్రామంలో జరిగిన <<18938568>>రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన<<>> రామగోని భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా గాయాలు తీవ్రమవడంతో ప్రాణాలు నిలువలేదు. భవానీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


