News February 15, 2025
మెట్పల్లి: Wow.. వెరైటీ పెళ్లి రోజు శుభాకాంక్షల కార్డు

ఓ ఉపాధ్యాయురాలు తన పెళ్లి రోజు శుభాకాంక్షల కార్డును వినూత్నరీతిలో తయారుచేశారు. జగిత్యాల(D) మెట్పల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు రమ్య (శోభారాణి)-మురళి దంపతుల పెళ్లిరోజు ఈనెల 15న ఉంది. పెళ్లిరోజును శుభాకాంక్షల రూపంలో ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చారు. ‘choose the correct answer’, ‘true or false’, ‘match the followings’ తో వెరైటీగా క్రియేట్ చేశారు. ఈ పెళ్లిరోజు శుభాకాంక్షల కార్డు పలువురిని ఆకట్టుకుంటుంది.
Similar News
News March 17, 2025
పాపం బామ్మ! రూ.20కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

ముంబైలో 86ఏళ్ల బామ్మ డిజిటల్ అరెస్టు బాధితురాలిగా మారారు. 2024 DEC 26 నుంచి MAR 3 వరకు ఏకంగా రూ.20.25 కోట్లు మోసపోయారు. ఆధార్, వ్యక్తిగత సమాచారంతో వేరెవరో బ్యాంకు A/C తెరిచి చట్టవిరుద్ధమైన పనులు చేసినట్టు సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. ఈ కేసులో కుమార్తెనూ అరెస్టు చేస్తామని బెదిరించారు. సాయపడాలని కోరడంతో డబ్బు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్టు గ్రహించిన ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 17, 2025
శ్రీసత్యసాయి: పదో తరగతి పరీక్షలకు 210 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షలలో మొదటి రోజు పరీక్షలో 210 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 21,393 మంది విద్యార్థులకు గాను 21,183 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పెనుకొండ డివిజన్లో 129 మంది, ధర్మవరం డివిజన్లో 81 మంది గైర్హాజరు అయ్యారన్నారు.
News March 17, 2025
సంగారెడ్డి: మొదటి సంవత్సరం పరీక్షకు 96.71% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.71% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.19,938 మంది విద్యార్థులకు గాను 19,282 మంది విద్యార్థులు హాజరయ్యారని, 656 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.