News August 20, 2025

మెదక్: అక్టోబర్ 12న జంగ్ సైరన్: ఎస్టీయూ

image

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కుల సాధన కోసం అక్టోబర్ 12న ‘చలో హైదరాబాద్’ పేరిట ‘జంగ్ సైరన్’ నిర్వహించనున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ తెలిపారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో సుమారు లక్ష మంది కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. హక్కులను సాధించుకోవడానికి ఈ ఉద్యమ కార్యాచరణను ప్రకటించినట్లు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

మెదక్: 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

image

ఈ నెల 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఓటరు దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహన ర్యాలీపై అధికారులతో సమీక్షించారు. నా భారత్ – నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు.

News January 23, 2026

MDK: ‘ఆపరేషన్ స్మైల్’.. 49 మంది చిన్నారులకు విముక్తి

image

మెదక్ జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలకార్మికులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మరో 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, ఈ విషయంలో జిల్లావ్యాప్తంగా 41 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పనిలో చేరిన నలుగురు పిల్లలను తిరిగి బడిలో చేర్పించామని, బాల్యానికి అండగా నిలుస్తామని డీపీఓ అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.

News January 23, 2026

MDK: ‘ఆపరేషన్ స్మైల్’.. 49 మంది చిన్నారులకు విముక్తి

image

మెదక్ జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలకార్మికులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మరో 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, ఈ విషయంలో జిల్లావ్యాప్తంగా 41 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పనిలో చేరిన నలుగురు పిల్లలను తిరిగి బడిలో చేర్పించామని, బాల్యానికి అండగా నిలుస్తామని డీపీఓ అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.