News May 15, 2024
మెదక్, జహీరాబాద్: ఎవరి ధీమా వారిదే !

మెదక్, జహీరాబాద్ MP స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్ల్లో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. మెదక్ లోక్సభ బీఆర్ఎస్ కంచుకోట అని, సిట్టింగ్ స్థానంలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.
Similar News
News December 15, 2025
చేగుంట శివారులో మృతదేహం గుర్తింపు

మెదక్ జిల్లా చేగుంట గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న బాలాజీ వెంచర్లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు, ఎలా మరణించాడు అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
News December 15, 2025
జిల్లాను ఓటింగ్లో టాప్లో ఉంచాలి: కలెక్టర్

శత శాతం ఓటింగ్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గత విడత ఎన్నికల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
News December 15, 2025
మెదక్: ‘3వ విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత’

మెదక్ జిల్లాలో జరగనున్న మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిందని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల భద్రతకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.


