News November 7, 2025
మెదక్: శ్మశానంలో దొంగలు.!

కీచురాళ్లు.. శవాలను తింటాయని చదివాం.. కానీ శ్మశానంలో దొంగల బెడద ఉందంటే నమ్ముతారా? అవును మీరు చదివింది నిజమే. మెదక్ జిల్లాలోని చేగుంటలోని వైకుంఠ ధామంలో కాలుతున్న శవాల బూడిద, పుర్రెలు, ఎముకలను దుండగులు ఎత్తుకెళ్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. బూడిదతో పాటు పుర్రెలను ఎత్తు కెళ్లటంతో వాటితో క్షుద్రపూజలు చేస్తున్నారా? అంటూ ప్రజలు భయపడుతున్నారు.
Similar News
News January 24, 2026
కామారెడ్డి: జిల్లాలో ‘బీసీ’లకే అగ్రపీఠం!

పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు ప్రాధాన్యత లభించింది. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు జిల్లాలో బీసీల రాజకీయ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో మూడు స్థానాలను బీసీలకు కేటాయించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో రాజకీయంలో అనుభవం ఉన్న ఆశావాహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
News January 24, 2026
ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

iPhone 18 ప్రో సిరీస్కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐలాండ్తో కాకుండా అండర్ డిస్ప్లే ఏరియాతో రానున్నట్లు సమాచారం. కొత్తగా 2nm టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్తో పాటు కెమెరాలో మెకానికల్ ఐరిస్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. భారత్లో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ కావొచ్చు. ధర విషయానికి వస్తే 18 ప్రో రూ.1,34,900, ప్రో మ్యాక్స్ రూ.1,49,900గా ఉండొచ్చు.
News January 24, 2026
468రోజుల తర్వాత సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ రెండో T20లో పరుగుల వరద పారించారు. 23 ఇన్నింగ్సుల(468 రోజులు) సుధీర్ఘ ఎదురు చూపులకు హాఫ్ సెంచరీతో చెక్ పెట్టారు. అది కూడా 23 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. T20WC నేపథ్యంలో తన ఫామ్పై వస్తున్న అనుమానాలను ఈ ఇన్నింగ్స్తో పటాపంచలు చేశారు. అలాగే సూర్య భారత్ తరఫున అత్యధిక T20I మ్యాచులు(126) ఆడిన లిస్ట్లో కోహ్లీ(125)ని దాటేశారు. రోహిత్(159) తొలిస్థానంలో ఉన్నారు.


