News December 17, 2025
మెదక్: సమయం లేదు ఓటరన్నా.. పరిగెత్తు..!

ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ క్లైమాక్స్కు చేరుకుంది. మధ్యాహ్నం 1 గంటకే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. క్యూలైన్లో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వాహనాలు ఏర్పాటు చేసి, బస్సు ఛార్జీలు ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు. గడువు ముగిసేలోపు తమ మద్దతుదారులందరితో ఓటు వేయించేందుకు అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
Similar News
News January 23, 2026
HNK: పరీక్ష హాల్లో సెల్ఫోన్.. ఆన్సర్ షీట్ వైరల్!

ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపం హనుమకొండ జిల్లాలో బట్టబయలైంది. SR ప్రైమ్ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షా కేంద్రంలోకి ఓ విద్యార్థి నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా జవాబు పత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన పరీక్షల్లో ఫోన్ లోపలికి ఎలా వచ్చిందో?
News January 23, 2026
V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
News January 23, 2026
ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.


