News March 12, 2025
మెదక్: హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంస్కృతి అద్దం పట్టేలా జరుపుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి జరిమానాలకు, రోడ్డు ప్రమాదాలకు గురై జైలు పాలు కావద్దని సూచించారు. హోలీ పండగ వేళ మన తోటి ఆడపడుచులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని తెలిపారు.
Similar News
News February 12, 2026
మెదక్: నేడు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాధికారి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించి, పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News February 12, 2026
మెదక్ జిల్లాలో 81.09 % పోలింగ్

మెదక్ జిల్లాలో 81.09% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారిగా మెదక్లో 80.75 %, రామాయంపేటలో 84.84%, తుప్రాన్లో 81.30%, నర్సాపూర్లో 78.61% పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేటలో అత్యధికంగా 84.84% పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 86,109 మంది ఓటర్లు ఉండగా 69,823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News February 12, 2026
మెదక్ జిల్లాలో 81.09 % పోలింగ్

మెదక్ జిల్లాలో 81.09% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారిగా మెదక్లో 80.75 %, రామాయంపేటలో 84.84%, తుప్రాన్లో 81.30%, నర్సాపూర్లో 78.61% పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రామాయంపేటలో అత్యధికంగా 84.84% పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 86,109 మంది ఓటర్లు ఉండగా 69,823 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


