News December 1, 2025

మేడారంపై గొంతు విప్పుతారా..!

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి WGL నుంచి కడియం కావ్య, బలరాం నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా మేడారం జాతర వచ్చే 2 నెలల్లో జరగనుంది. ఇప్పటికే నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల మేర నిధులను కేటాయించింది. మరో పక్క కేంద్రం మేడారంను జాతీయ పండగగా మార్చేందుకు ససేమిరా అంటోంది. దీనిపై ఈ సీజన్లో గొంతు విప్పి అడిగి ఎండగడితే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది.

Similar News

News February 13, 2026

BREAKING: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

కొత్తగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 18 వార్డులకు గాను 13 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 5 వార్డులు BRS గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

BREAKING: రామాయంపేట మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

రామాయంపేట మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 3 వార్డులు BRS, 1 వార్డు బీజేపీ గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

గద్వాల: మున్సిపల్ పోరులో ‘హంగ్’.. ఛైర్మన్ పీఠం ఎవరికి?

image

గద్వాల మున్సిపాలిటీలో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మొత్తం 37 వార్డుల్లో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12, బీజేపీ 7, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. మేజిక్ ఫిగర్ 19 కాగా, అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ మరో నలుగురి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అయితే, వ్యూహాత్మకంగా బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపితే (12+7=19) సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.