News August 13, 2025
మేడూరి నాగేశ్వరరావు: స్వాతంత్ర్య సమరయోధుడు

మేడూరి నాగేశ్వరరావు (1910-1998) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఏటుకూరులో జన్మించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1936 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. 1959-1970 వరకు గుంటూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా మూడుసార్లు పనిచేశారు. 1971, 1977, 1980లలో లోక్సభకు ఎన్నికయ్యారు. 1998లో మరణించారు.
Similar News
News March 13, 2026
ఏలూరు: కలెక్టరేట్లో మొల్లమాంబ జయంతి

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జేసీ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవయిత్రి మొల్ల మాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సూచించారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
News March 13, 2026
అమ్రాబాద్: గవర్నర్ దంపతులకు అధికారుల ఘన స్వాగతం

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల దంపతులకు అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. శ్రీశైలం వెళ్తున్న క్రమంలో గెస్ట్ హౌస్ వద్ద కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
News March 13, 2026
ఏలూరు: గ్యాస్ సెగ: కట్టెల పొయ్యే దిక్కు!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత హోటల్, క్యాటరింగ్ రంగాలను అతలాకుతలం చేస్తోంది. సరఫరా నిలిచిపోవడంతో ఆర్డర్లు తీసుకోలేక నిర్వాహకులు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటకు సిద్ధమవుతున్నా, ఇంధనం దొరక్క ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ కొరతతో జిల్లాలో రెస్టారెంట్ నిర్వహణ భారంగా మారి, వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.


