News August 7, 2024

మైదుకూరు: కరెంట్ షాక్‌తో మహిళ మృతి

image

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని లింగాలదిన్నెలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంలో ధనికెల చిన్నక్క(28) అనే మహిళ మృతి చెందింది. గ్రామ సమీపంలోని పంట పొలంలో గల విద్యుత్ మోటార్ వద్దకు వెళ్లిన చిన్నక్క ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 11, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.12,850
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.11,813
☛ వెండి 10 గ్రాముల ధర రూ.1,870.

News December 11, 2025

విజేత కడప జట్టు

image

పులివెందుల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటులో కడప జట్టు విజేతగా నిలిచింది. గురువారం కడప, విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు గెలుపొందింది. రెండో స్థానంలో విశాఖ, తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచింది. ఆయా జట్ల విజేతలకు MLC రాంగోపాల్ రెడ్డి బహుమతులను అందజేశారు.

News December 11, 2025

కడప మేయర్ ఎన్నికకు టీడీపీ దూరం: వాసు

image

కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. గురువారం ఆయన కడపలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఎమ్మెల్యే మాధవి, టీడీపీ సభ్యులైన పలువురు కార్పొరేటర్లు ఈ ఎన్నిక సమావేశానికి హాజరు కావడం లేదన్నారు.