News September 10, 2025
మొగిలిచెర్ల శిల్పాలు ఏకవీర దేవి ఆలయానికి తరలింపు

WGL నగరానికి చెందిన 31 పురాతన శిల్పాలను మొగిలిచెర్ల గ్రామం నుంచి ఏకవీరదేవి ఆలయానికి తరలించారు. GWMC అధికారులు 2 రోజులుగా ఎంతో జాగ్రత్తగా ఈ శిల్పాలను తరలించి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఈ చర్య వల్ల విలువైన మన సాంస్కృతిక వారసత్వం సంరక్షణలోకి రావడంతో పాటు, ప్రజలు వాటిని దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. మన చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టే ఈ శిల్పాల పరిరక్షణలో GWMC సిబ్బంది కృషిని అభినందించారు.
Similar News
News December 16, 2025
గుంటూరులో అదృశ్యం.. హైదరాబాద్లో ప్రత్యక్షం

గుంటూరులో అదృశ్యమైన ఇద్దరు బాలురు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. లాలాపేటకు చెందిన రెహమాన్ బాషా, నరసరావుపేటకు చెందిన జవాద్ మల్లారెడ్డి నగర్ మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఫంక్షన్ వచ్చి ఈ నెల 14న అదృశ్యమయ్యారు. అయితే రహమాన్ బాషా తల్లిదండ్రులు గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉంటున్న తల్లి వద్దకు రహమాన్ తన స్నేహితుడు జావాద్ని కూడా వెంట పెట్టుకొని వెళ్లాడు.
News December 16, 2025
వనపర్తిలో 17న మూడో విడత ఎన్నికలు

వనపర్తి జిల్లాలో ఈ నెల 17న (బుధవారం) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పానుగల్, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లో జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 16, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు: DIEO

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియటి మొదటి రెండో సంవత్సరం వార్షిక పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. తత్కాల్ స్కీం ద్వారా ఈనెల 22 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు నిర్ణీత పరీక్ష ఫీజుకు రూ.5000 విద్యార్థులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అనకాపల్లి DIEO మద్దిల వినోద్ బాబు కళాశాలల ప్రిన్సిపాల్స్కు తెలిపారు.


