News November 19, 2025
మోక్షాన్ని పొందడమే మన ధర్మం

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||
ఏ దేవుడు పరమతేజమో, ఏ దేవుడు గొప్ప తపమో, ఏ దేవుడు మహత్తరమైన పరబ్రహ్మమో, ఏ దేవుడు పరాయణమో అతడొక్కడే సర్వభూతములకు పొందదగిన స్థానము. ఆ పరాయణమ్ ఈ సృష్టిలోని సకల ప్రాణులకూ చేరుకోవాల్సిన శాశ్వతమైన గమ్యం. ఆ నిత్య తత్వాన్ని ఆరాధించి, మోక్షాన్ని పొందడమే మన ధర్మం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
Similar News
News January 22, 2026
ఈ నెల 30న ఓటీటీలోకి ‘ధురంధర్’!

అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ త్వరలోనే ఓటీటీ అభిమానులను అలరించనుంది. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచిన ధురంధర్ చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మొత్తం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మీరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా?
News January 22, 2026
ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.
News January 22, 2026
500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన ప్లేయర్గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్లో 18 మంది 500 వికెట్లు తీశారు.


