News November 6, 2025

‘మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్’ ప్రారంభం

image

భద్రాద్రి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునికంగా, సురక్షితంగా, పిల్లల స్నేహపూర్వక వాతావరణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రస్తుత అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు సౌకర్యాలు, భద్రత, సౌందర్యం, ప్రాప్యత, పర్యావరణ స్థిరత్వం వంటి అంశాల్లో మెరుగుదలకు విస్తృత అవకాశాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

MDCL: ఫిట్స్ టాబ్లెట్స్ కొంటున్నారా..? జాగ్రత్త..!

image

ఫిట్స్ తగ్గటం కోసం డాక్టర్లు రాసే ఔషధల్లో Levipil 500 ఒకటి. అయితే.. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో సన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఈ మందులను తయారు చేస్తున్నట్లుగా టాబ్లెట్ షీట్లపై ముద్రించి విక్రయిస్తున్నట్లు DGCA అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని సీజ్ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టాబ్లెట్లు కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.

News January 14, 2026

HYD: సిటీలోని జైళ్లు కూడా డిజిటల్ మయం!

image

సిటీలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో పాత పద్ధతులకు కాలం చెల్లింది. అంతా టెక్నాలజీ హవానే. రూ.2.5 కోట్ల విలువైన డ్రోన్లు, కంప్యూటర్లు, వాకీటాకీలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘స్వాగతం’ పోర్టల్, ఈ-ఆఫీస్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోయింది. ఖైదీలు తమ కేసు స్టేటస్ చూసుకోవడానికి 52 కొత్త మెషిన్లు కూడా వచ్చేశాయి. టెక్ అప్‌గ్రేడ్‌తో తెలంగాణ జైళ్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.

News January 14, 2026

NRPT: పట్టాదారు పాసుపుస్తకాల జారీలో జాప్యం

image

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల జారీ తీవ్రంగా ఆలస్యమవుతోంది. భూమి రిజిస్ట్రేషన్ చేసి 9 నెలలు గడుస్తున్నా పాసుపుస్తకాలు అందకపోవడంతో రైతులు, కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాసుపుస్తకం లేక బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మీసేవలో ఛార్జీలు వసూలు చేస్తున్నా సేవలు సకాలంలో అందడం లేదని, గతంలో ధరణి పోర్టల్ ద్వారా త్వరగా పాసుపుస్తకాలు వచ్చేవని రైతులు అంటున్నారు.