News November 19, 2025
మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
Similar News
News January 23, 2026
నేడు వసంత పంచమి.. ఈ పనులు చేయకండి

వసంత పంచమిని జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే రోజుగా చెప్తారు. ఇవాళ పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘దీనిని ప్రకృతి పండుగగా భావిస్తారు. నేడు వసంత రుతువు ప్రారంభమవుతుంది. అందుకే చెట్లు, మొక్కలకు హాని చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇవాళ శుక్రుడు అస్తమిస్తున్నాడు. అందుకే శుభకార్యాలు, వ్యాపారాలు ప్రారంభించొద్దు’ అని సూచిస్తున్నారు.
News January 23, 2026
నేడు ఏ రంగు దుస్తులు ధరించాలంటే..?

వసంత పంచమి నాడు పసుపు రంగుకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇది జ్ఞానానికి, కొత్త చిగురులకు, సూర్యకాంతికి చిహ్నం. ఈరోజున భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి పూజలో పాల్గొంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. పూజలో పసుపు రంగు పువ్వులు, పసుపు అక్షింతలు వాడటంతో పాటు, నైవేద్యంగా పసుపు రంగు వంటకాలు సమర్పిస్తే సానుకూల శక్తి పెరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యాబుద్ధులు సొంతమవుతాయని నమ్మకం.
News January 23, 2026
సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయాలి: కలెక్టర్

రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 14,000 సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విజయానంద్ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలన్నీ సక్రమంగా పనిచేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి విజయానంద్ తెలిపారు.


