News November 17, 2025

యలమంచిలి ఎమ్మెల్యేపై పవన్ సీరియస్

image

అచ్యుతాపురం (M) దుప్పితూరు భూ వివాదంలో MLA జోక్యం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. పార్టీకి డ్యామేజ్ చేసే వ్యవహారాల్లోకి వెళ్లొద్దని మంత్రి నాదెండ్ల ద్వారా విజయకుమార్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకుని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దని పవన్ సూచించినట్లు సమాచారం. MLA నుంచి వివరణ కూడా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News January 22, 2026

పుష్ప-3లో సల్మాన్ ఖాన్? సక్సెస్ అయితే..

image

పుష్ప-3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు యూనిట్ వర్గాలు హింట్ ఇచ్చాయి. ఈ మూవీ 2 పార్ట్‌లు సాధించిన సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకొని ‘పుష్ప’ను ఓ యూనివర్స్‌లా మార్చే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు HYDలో ఆఫీస్ ఓపెన్ చేశారట. అందులో భాగంగా పుష్ప-3లో సల్మాన్ ఖాన్‌ను పవర్‌ఫుల్ రో‌ల్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. సక్సెస్‌ను బట్టి ఆయనతో పుష్ప సిరీస్‌లో ప్రత్యేక సినిమా ఉండొచ్చని టాక్.

News January 22, 2026

ICOC చిత్తూరు ఛైర్మన్‌గా మనోజ్

image

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్‌గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.

News January 22, 2026

దారులన్నీ మేడారం వైపే!

image

వనదేవతల మహాజాతర సమయం ఆసన్నం కావడంతో దారులన్నీ మేడారం వైపే మళ్లుతున్నాయి. బుధవారం నుంచి శ్రీ సమ్మక్క-సారలమ్మల జాతర ఉత్సవాలు ‘మండ మెలగు’ వేడుకతో వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్ల జాతర వైభవాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు ఉత్సాహంగా పయనమవుతుండటంతో అటవీ ప్రాంతం జనసంద్రంగా మారింది.