News August 11, 2025
యాచారం: ట్రాక్టర్ ఢీకొని 3ఏళ్ల బాలిక మృతి

అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకున్న పాపాయిని ట్రాక్టర్ మృత్యువు రూపంలో కబలించింది. స్థానికుల వివరాలిలా.. రంగారెడ్డి జిల్లా యాచారం పరిధి మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వన్నాడపు బీరప్ప కుమార్తె అవంతిక (3)ను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 10, 2026
MBNR: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం – కలెక్టర్

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.
News March 10, 2026
పశువులకు సరైన సమయంలో టీకాలు ఇవ్వాలి: కలెక్టర్

పశువులకు సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ టీకాలు అందించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మాచారెడ్డిలో పశువుల ఆరోగ్య సంరక్షణకు 8వ విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పశువులకు ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రతి గ్రామంలో టీకాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి దేవేందర్, తదితరులున్నారు.
News March 10, 2026
తిర్యాణి: అడవి సంపద రక్షణకు.. సిలిండర్ మార్గమా..?

జాతీయ అడవి, వన్య ప్రాణి పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో అడవి సంపదను రక్షించేందుకు ఆ శాఖ అధికారులు అనేక రకాలుగా చర్యలు చేపడుతున్నారు. అయితే అవి అడవి సంపదను కాపాడుతాయా అనే ప్రశ్న కూడా మొదలైంది. ఏటా కొన్ని వేల టన్నుల వంట చెరుకు కాలుస్తున్నారని.. గిరిజనులు అడవికి వెళ్లకుండా సిలిండర్ ఉపాయాన్ని అధికారులు ముందట వేసుకున్నారు. అయితే ఇలా ఎన్ని రోజులు అందిస్తారో తెలియాల్సి ఉంది.


