News August 12, 2025

యాదాద్రిలో ఈ నెల 15న ఉచిత వరలక్ష్మీ వ్రతం

image

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 15న శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వెంకట్రావు తెలిపారు. వ్రతంలో పాల్గొనే మహిళా భక్తులు రేపు సాయంత్రం 5 గంటలలోపు కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండప కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News March 13, 2026

వారిద్దరూ పార్టీని చీల్చారు: దేవ్‌జీ

image

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి వెనక పెద్ద కుట్ర ఉందని ఇటీవల లొంగిపోయిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ అన్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభం కాగానే నంబాల బాడీగార్డులు లొంగిపోయి ఇన్‌ఫార్మర్లుగా మారారని ఆరోపించారు. కీలక నేతలైన మల్లోజుల, ఆశన్న శత్రువులకు లొంగిపోయి ఆయుధాలు అప్పగించారని పేర్కొన్నారు. వీరిద్దరూ పార్టీని చీల్చారని ఆరోపించారు. తాము మాత్రం ఆయుధాలను అడవుల్లోనే వదిలేశామని చెప్పారు.

News March 13, 2026

ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైంది: ట్రంప్

image

తాము చేస్తున్న దాడులకు భయపడిపోయి ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైందని US అధ్యక్షుడు ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని Axios వెల్లడించింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్‌లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. ‘లీడర్ అంటూ ఎవరూ లేరు. అందుకే లొంగిపోవడం గురించి ఎవరూ ప్రకటించలేదు’ అని పేర్కొన్నారు.

News March 13, 2026

ధైర్యంగా పరీక్షలు రాయండి: కలెక్టర్ రాహుల్ శర్మ

image

శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలని సూచించారు. సరైన ప్రణాళిక, సమయపాలన పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. చదువుపై పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఇది విద్యార్థుల జీవితంలో కీలక ఘట్టమని కలెక్టర్ గుర్తుచేశారు.