News February 7, 2025
యాదాద్రి: అడవి దున్న మృతి..

కొద్దిరోజులుగా జిల్లాలో హల్చల్ సృష్టించిన <<15388923>>అడవి దున్న<<>> మరణించింది. కొద్ది గంటల క్రితమే చాకచాక్యంగా దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్న అటవీ శాఖ అధికారులు అది మృతి చెందినట్లు తెలిపారు. కాగా, రెండు రోజుల నుంచి విపరీతంగా తిరగడంతో <<15386379>>దున్న <<>>అనారోగ్యానికి గురై చనిపోయిందని జిల్లా అధికారి పద్మజారాణి పేర్కొన్నారు. ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా పంచనామ నిర్వహించనున్నట్లు చెప్పారు.
Similar News
News February 18, 2026
రోజూ 10 నిమిషాలు ఎండలో ఉంటే..

రోజుకు 10 నిమిషాలైనా ఎండలో ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘సూర్యరశ్మి వల్ల విటమిన్-D పెరుగుతుంది. ఇది ఎముకల బలానికి అవసరమైన కాల్షియంను గ్రహించడానికి సాయపడుతుంది. మూడ్ని మార్చేసి, డిప్రెషన్ను తగ్గిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. రోజంతా ఎనర్జీతో ఉండేలా చేస్తుంది. చర్మంలోని నైట్రిక్ ఆక్సైడ్ విడుదలయ్యేలా చేస్తుంది. ఇది రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది’ అని చెబుతున్నారు.
News February 18, 2026
రీసర్వే వేగవంతం చేయండి: శ్రీకాకుళం కలెక్టర్

రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, రికార్డుల్లో వ్యత్యాసాలను సరిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. 4వ దశ రీసర్వే 167 గ్రామాల్లో జరుగుతోందని,24 గ్రామాల్లో పూర్తయిందన్నారు. weblandలో ఇతరుల పేరిట ఉన్న భూముల వివరాలు పరిశీలిస్తే 29,953 సర్వే నంబర్లలో తప్పులున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు.
News February 18, 2026
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు!

TG: 2025-2028కు సంబంధించి ప్రైవేటు ఇంజినీరింగ్ ఫీజులను రాష్ట్ర అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ఖరారు చేసింది. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. 63 కళాశాలల్లో పెంచగా, 19 కాలేజీల్లో తగ్గించింది. ఓ సంస్థలో అత్యధికంగా ₹62 వేలు పెరిగింది. CBITలో అత్యధికంగా ₹1.83 లక్షల ఫీజు ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి ఈ మేరకు TAFRC నివేదిక పంపింది. త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది.


