News March 13, 2025
యాదాద్రి క్షేత్రంలో రేపు చండీ హోమం

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News April 11, 2026
రిస్కీ రీఎంట్రీ: 40,000kmph వేగం.. 2,760°C టెంపరేచర్

ఆర్టెమిస్-2 మిషన్లో రీఎంట్రీ అత్యంత రిస్కీ పార్ట్. 40,000kmph స్పీడ్తో భూవాతావరణంలోకి క్యాప్సూల్ దూసుకొచ్చింది. అప్పుడు పుట్టిన 2,760°C వేడికి ఓరియన్ క్యాప్సూల్ చుట్టూ ఎర్రటి ప్లాస్మా సెగలు కమ్మేశాయి. అప్పుడే 6 నిమిషాలు కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో హ్యూస్టన్ కంట్రోల్ రూమ్లో టెన్షన్ పీక్స్కు చేరింది. హీట్ షీల్డ్ ప్రాణాలు కాపాడగా పారాచూట్లు విచ్చుకుని వ్యోమగాములు సేఫ్గా దిగడంతో రిలీఫ్ అయ్యారు.
News April 11, 2026
కాళేశ్వరం ప్రాజెక్ట్.. సీఎం టైం బాండ్ అతిపెద్ద సవాల్

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో 2023 నుంచి సాంకేతిక లోపాలతో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులపై సమీక్షించిన సీఎం వానకాలంలోపు పూర్తిచేయాలని టైం బాండ్ పెట్టడంతో ఇరిగేషన్ శాఖ టెన్షన్ పడుతోంది. దెబ్బతిన్న బ్యారేజీలు, పంపు హౌస్లో సాంకేతిక సమస్యలు, క్లిష్టమైన ఇంజినీరింగ్ పనులు ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.
News April 11, 2026
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు రానున్నారు. ముందుగా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ రాష్ట్ర కమిటీపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


