News November 6, 2025

యాదాద్రి: తెగిపడిన విద్యుత్ వైర్లు.. వృద్ధుడు, గేదె మృతి

image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గేదెల కాపరి గొర్ల మల్లయ్య(55) రోజూ మాదిరిగానే తన గేదెలను మేపడానికి వెళ్లారు. అక్కడ ఓ వ్యవసాయ భూమిలో తెగి నేలపై పడిన కరెంటు వైర్లను గమనించకుండా, మేస్తున్న తన గేదెను పక్కకు కొట్టే ప్రయత్నంలో మల్లయ్యకు షాక్ తగిలింది. ఈ ఘటనలో మల్లయ్య, ఆయన గేదె అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News January 13, 2026

కోడిపందేలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్!

image

హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో కోడిపందేల నియంత్రణకు కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు 0884-2356801 నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పందేలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

News January 13, 2026

తిరుమలలో ఎల్లుండి నుంచి సుప్రభాత సేవ

image

తిరుమల శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస తిరుప్పావై పాశురాల పారాయణం బుధవారంతో ముగియనుంది. డిసెంబర్ 17వ తేదీ నుంచి శ్రీవారికి బిల్వ పత్రాలతో సహస్రనామార్చన, శ్రీవల్లి పుత్తూరు చిలుకలు అలంకరించి పూజలు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి యథావిధిగా వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపుతారు.

News January 13, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’.. చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

image

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీకి చిరు కూతురు సుష్మిత కో-ప్రొడ్యూసర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు రూ.కోటితో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు రూ.50 కోట్లు, భోళా శంకర్‌కు రూ.63 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.