News February 6, 2025
యాదాద్రి: రైతు భరోసా నిధులు జమ

భువనగిరి జిల్లాలో ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమాయ్యాయి. యాదాద్రి జిల్లాలో మొత్తం 78,795 మంది రైతులకు గాను రూ.46,44,93,195 రూపాయల రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమయ్యాయి. గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5వేలు జమ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఒక ఎకరాకు 6000 రూపాయలను జమ చేస్తోంది.
Similar News
News January 18, 2026
KNR: మేడారం జాతరకు ప్రత్యేక బస్సుల, ఛార్జీల వివరాలు

మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి. KNR నుంచి 140 బస్సులు, పెద్దలకు రూ.390, పిల్లలకు రూ.220, HSB నుంచి 50 బస్సులు, పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.200, HZBనుంచి 50 బస్సులు, పెద్దలకు రూ.320, పిల్లలకు రూ.180, PDPL నుంచి 175 బస్సులు, పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.240, GDK నుంచి 115 బస్సులు, పెద్దలకు రూ.400, పిల్లలకు రూ.230, MNTY 170 బస్సులు, పెద్దలకు రూ.350, పిల్లలకు 210గా ఉన్నాయి.
News January 18, 2026
తిరుపతి: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

తిరుచానూరు సమీపంలోని NTR మహిళా ప్రాంగణం నందు ఔత్సాహిక మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా పేర్కొన్నారు. సారీ రోలింగ్ – 10 రోజులు, మిల్లెట్స్ స్నాక్స్ తయారీ, (ప్యాకింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్) – 15 రోజులు కిచెన్, టెర్రస్ గార్డెనింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రాం – 30 రోజులు. 18- 45 ఏళ్లలోపు 8వ తరగతి పాసైన మహిళలు అర్హులన్నారు.
News January 18, 2026
KNR రీజియన్లో 700 బస్సులు ఏర్పాట్లు

మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక<<18889925>> బస్సులు<<>> ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ KNR RM బి.రాజు తెలిపారు. JAN 27 నుంచి JAN 31వ తేదీ వరకు KNR రీజియన్ పరిధిలో <<18874838>>700<<>> బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రత్యేక బస్సులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని అన్నారు. ఆర్టీసీ బస్సులు గద్దె వరకు వెళ్లే సౌలభ్యం ఉన్నందున ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయాలని కోరారు.


