News March 9, 2025
యాదాద్రి శ్రీవారి తిరు కళ్యాణంలో ప్రముఖులు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షికబ్రహ్మోత్సవంలో భాగంగా తిరు కళ్యాణం శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవాదాయ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కరరావు, ఛైర్మన్ నరసింహమూర్తి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Similar News
News January 15, 2026
తిరుపతి: భయపెడుతున్న టిప్పర్లు

తిరుపతి జిల్లా నుంచి తమిళనాడుకు భారీగా గ్రావెల్, ఇసుక, కంకర తరలిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం మీదుగా రోజుకు 250 నుంచి 300 వరకు టిప్పర్లు బార్డర్ దాటుతున్నాయి. కొన్ని అనుమతులు లేకుండా, మరికొన్ని నకిలీ బిల్లులతో తరలిస్తున్నారని సమాచారం. పుత్తూరు-చెన్నై మెయిన్ రోడ్డుపై రాత్రి వేళ టిప్పర్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఆ మార్గంలో ప్రయాణాలంటేనే అందరూ హడలిపోతున్నారు.
News January 15, 2026
పతంగుల జోరు.. యమపాశం కావొద్దు: సజ్జనార్

TG: సంక్రాంతికి పతంగులు ఎగరేయడం మన ఆనవాయితీ అని, కొందరి నిర్లక్ష్యం వల్ల ఈ పండుగ పక్షులకు, వాహనదారులకు శాపంగా మారుతోందని HYD CP సజ్జనార్ అన్నారు. ‘చైనా మాంజాపై సంపూర్ణ నిషేధం ఉంది. నైలాన్, గాజు పొడి అద్దిన సింథటిక్ దారాలను అమ్మినా, కొన్నా, వాడినా చట్టం ఊరుకోదు. బైకర్ల మెడకు మాంజా చుట్టుకొని గొంతు తెగిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నం. మీ సరదా అమాయకుల ప్రాణాలను బలిగొనకూడదు’ అని ట్వీట్ చేశారు.
News January 15, 2026
ఇవి తీసుకుంటే PCODకి చెక్

ఈ మధ్య కాలంలో మహిళలను PCOD ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య వల్ల అవాంఛిత రోమాలు రావడం, పీరియడ్స్ అస్తవ్యస్తంగా మారతాయని నిపుణులు. అయితే ఇది తగ్గాలంటే ఆహారంలో దాల్చిన చెక్క పొడి, పుదీనా టీ, ఫ్లాక్స్ సీడ్స్ చేర్చుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, వ్యాయామం చేయడం, మంచి డైట్ తీసుకోవడం కూడా ముఖ్యమని చెబుతున్నారు.


