News November 19, 2025

యువత 20 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవాలి: శ్రీధర్

image

యువత పెళ్లి కంటే కెరీర్‌పై ఫోకస్ చేయడం న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాకు సంకేతమన్న ఉపాసన <<18317940>>వ్యాఖ్యలపై<<>> ZOHO ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు. యువ వ్యాపారవేత్తలు, స్త్రీ, పురుషులు 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని తాను సూచిస్తానన్నారు. ‘సమాజానికి జనాభాను అందించే డ్యూటీని యువత నిర్వర్తించాలి. ఆ ఆలోచనలు విచిత్రంగా, పాతచింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి. కానీ కాలక్రమంలో అందరూ దీన్నే అనుసరిస్తారు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 12, 2026

గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండవచ్చా?

image

ఇంటి గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండటం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ఈ నిర్మాణం బయట నుంచి వచ్చే సహజ గాలి, వెలుతురును అన్ని గదుల్లోకి ప్రసరించేలా చేస్తుందంటున్నారు. ‘ఇది గదిలో ఉండే వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇల్లు ఎప్పుడూ తాజాదనంతో ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత తగ్గి, గృహస్థులు ఉత్సాహంగా తమ జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 12, 2026

జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత

image

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10న అర్ధరాత్రి 2 సార్లు స్పృహతప్పి పడిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేసినట్లు చెప్పింది. 2025 మార్చిలోనూ ఆయన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య కారణాలతో గతేడాది జులైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన <<17154846>>రాజీనామా<<>> చేయడం తెలిసిందే.

News January 12, 2026

శాంసంగ్‌కు చెక్.. టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా యాపిల్

image

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో యాపిల్ కంపెనీ నంబర్ వన్‌గా నిలిచింది. ఐఫోన్ 17 సక్సెస్, 16కు భారీ డిమాండ్, సేల్స్‌లో 10 శాతం గ్రోత్ సాధించడంతో గత 14 ఏళ్లలో తొలిసారిగా టాప్‌లోకి వచ్చింది. శాంసంగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ 20%, శాంసంగ్ 19%, షియోమీ 13%, వివో 8%, ఒప్పో 8%, ఇతర బ్రాండ్లు 32% వాటా కలిగి ఉన్నాయి.