News August 20, 2025
యూరియా విక్రయాలపై వరంగల్ సీపీ కీలక ఆదేశాలు

వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. యూరియా బ్యాగులను బ్లాక్ చేయడం, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వారిని గుర్తించి స్థానిక పోలీసులు నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించారు. యూరియా విక్రయ కేంద్రాలకు రైతన్నలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్ పద్ధతిని కొనసాగించాలన్నారు.
Similar News
News January 17, 2026
ముక్కనుమ రోజు మాంసాహారం తినవచ్చా?

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో శాకాహారానికే ప్రాధాన్యతనిచ్చే ప్రజలు నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారాన్ని ఇష్టంగా వండుకుంటారు. అందుకే దీనిని వాడుక భాషలో ముక్కల పండుగ అని పిలుస్తారు. ఈ రోజున గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, ఆపై బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. శాస్త్రపరంగా దీనికి అభ్యంతరం లేదు కాబట్టి, పల్లెల్లో ప్రతి ఇంటా ముక్కనుమ విందు ఘనంగా జరుగుతుంది.
News January 17, 2026
జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు కర్నూలు యువతి

జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.
News January 17, 2026
రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్.. నేడే శంకుస్థాపన

AP: రాష్ట్రంలో రూ.13,000 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి నేడు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 2,600 మందికి ఉపాధి దక్కనుంది. దీనిని AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుండగా ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది.


