News June 20, 2024

రఘునాథపల్లి: లబ్ధిదారునికి CMRF చెక్కు అందజేత

image

పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన మధుకి రూ.80వేల సీఎం సహాయనిది చెక్కు మంజూరు అయింది. అందుకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే ఈరోజు లబ్ధిదారు కుటుంబానికి తన కార్యాలయంలో అందించారు.

Similar News

News January 24, 2026

వరంగల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపినందుకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి నిరంతర శిక్షణ, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించినందుకు ఈ గుర్తింపు లభించింది. జనవరి 25న హైదరాబాద్‌లో గవర్నర్ జిష్ణు‌దేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

News January 23, 2026

వరంగల్ RJDగా లక్ష్మణుడు బాధ్యతల స్వీకరణ

image

మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా హైదరాబాదులో అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మణుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ పనిచేస్తున్న RJD ఉప్పుల శ్రీనివాస్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం లక్ష్మణుడిని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. వరంగల్ RJDగా బాధ్యతలు తీసుకున్న లక్ష్మణుడికి మార్కెటింగ్ శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

News January 21, 2026

WGL: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు సర్వర్‌కు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.