News November 19, 2025
రవికుమార్ కాల్ డేటాపై పరిశీలన..!

తిరుమల పరకామణీ చోరీ కేసులో నిందితుడు రవి కుమార్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అతను ఎవరితో మాట్లాడారు.. ఎవరితో ఛాటింగ్ చేశారు.. చోరీతోపాటు ఇతర అనుబంధ విషయాల గురించి ఆధారాలు సేకరిస్తున్నారు. మరికొందరి డేటా కూడా పరిశీలనచేస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 17, 2026
రాహుల్ను అవమానించానని ఫీలవుతున్నా: జగ్గారెడ్డి

TG: సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయనని PCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ‘గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సంగారెడ్డి వచ్చి నన్ను గెలిపించాలని కోరితే ఇక్కడివారు ఓడించారు. ఆయన్ను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమోనని ఫీలవుతున్నాను. నా ఓటమికి కారణం పేదలు కాదు మేధావులు, పెద్దలే. అందుకే ఇకపై ఇక్కడ పోటీచేయదల్చుకోలేదు. నా భార్య ఇక్కడ పోటీ చేసినా ప్రచారం చేయను’ అని పార్టీ భేటీలో స్పష్టం చేశారు.
News January 17, 2026
వైన్ షాపుల వద్దే పండుగ జరుగుతుంది: అంబటి

జగన్ పాలన తిరిగి వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో శనివారం దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత కమిటీ నిర్మాణంపై సమావేశం జరిగింది. రాష్ట్రంలో పండుగ అంటే వైన్ షాపులు దగ్గరే జరుగుతుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పథకాలు అందేవని వాటితో వారు పండగలు నిర్వహించుకునేవారని అంబటి అన్నారు.
News January 17, 2026
బంగ్లాలో మరో హిందువు హత్య.. కారుతో ఢీకొట్టి..

బంగ్లాదేశ్లో హిందువులపై <<18840974>>దారుణాలు<<>> ఆగడం లేదు. రాజ్బరి జిల్లాలో రిపోన్ సాహా(30) అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపేశారు. BNP నేత అబుల్ హషేమ్ కారులో పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లబోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన రిపోన్పైకి కారును ఎక్కించాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, హషేమ్, కారు డ్రైవర్ కమాల్ హొసైన్ను అరెస్టు చేశారు.


