News August 22, 2025
రాజంపేట: అయ్యో పాపం..!

ఆ 8మంది సరదాగా ఈతకు వెళ్లారు. సంతోషంగా గడుపుతున్న వేళ ప్రమాదం దరి చేరింది. కళ్ల ముందే స్నేహితులు నీటిలో మునిగిపోయారు. ఒకదాని తర్వాత మరొక మృతదేహాలను వెలికి తీసి ఒడ్డున వేస్తుంటే ఆపుకోలేని దుఃఖంతో కుమిలిపోయారు. ఎదిగొచ్చిన బిడ్డలు విగతజీవులుగా మారిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బోరున విలపించారు. చెయ్యేరు నదిలో ముగ్గురు విద్యార్థుల <<17476364>>మృతికి <<>>సంబంధించిన విషాద గాథ ఇది.
Similar News
News January 19, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ నేడు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 19, 2026
కామారెడ్డి: ప్రియం కానున్న ఓటు విలువ

ఇంకా మున్సిపల్ ఎలక్షన్ కోడ్ కూయక ముందే కామారెడ్డిలో రాజకీయ వేడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎక్కడిక్కడ ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందుగా విందు ఇస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. టికెట్ తెచ్చుకునే బాధ్యత మాది, గెలిపించే బాధ్యత మీది అంటూ సవాలు చేస్తున్నారు. ఈ సారి యువత పోటీలో ఉండేందుకు తీవ్ర కసరత్తు ప్రారంభించారు. దీంతో కామారెడ్డి మున్సిపల్ మరింత ప్రియం కానుంది.
News January 19, 2026
కామారెడ్డి: ప్రియం కానున్న ఓటు విలువ

ఇంకా మున్సిపల్ ఎలక్షన్ కోడ్ కూయక ముందే కామారెడ్డిలో రాజకీయ వేడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎక్కడిక్కడ ఆశావాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందుగా విందు ఇస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. టికెట్ తెచ్చుకునే బాధ్యత మాది, గెలిపించే బాధ్యత మీది అంటూ సవాలు చేస్తున్నారు. ఈ సారి యువత పోటీలో ఉండేందుకు తీవ్ర కసరత్తు ప్రారంభించారు. దీంతో కామారెడ్డి మున్సిపల్ మరింత ప్రియం కానుంది.


