News May 7, 2025

రాజధానిలో కొత్త వ్యక్తులపై నిఘా ఉంచండి

image

అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

Similar News

News February 8, 2026

GNT: వెహికల్ చెకింగ్.. రూ.5లక్షల జరిమానా, 72 సీజ్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పోలీసులు రహదారి భద్రతా డ్రైవ్ చేపట్టారు. మొత్తం 2,436 వాహనాలను ప్రధాన కూడళ్లల్లో తనిఖీ చేశారు. త్రిపుల్ రైడింగ్, అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణం‌, మైనర్ల డ్రైవింగ్‌ని గుర్తించి
933 వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు రూ.5,67,590 జరిమానా విధించారు. ధృవపత్రాలు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేశారు.

News February 8, 2026

GNT: రేపు ఎస్పీ ఆఫీసులో PGRS రద్దు

image

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు గమనించాలని చెప్పారు.

News February 8, 2026

రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలు: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. https://Meekosam.ap.gov.inవెబ్ సైట్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని, డయల్ 1100కి ఫోన్ చేసి అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. మండలాల వారీగా రెవెన్యూ క్లీనిక్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. అక్కడ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు.