News August 12, 2025
రాజధాని అమరావతి జిల్లా కేంద్రంగా మారనుందా?

అమరావతి రాజధాని జిల్లా కేంద్రంగా మారనుందా అనే ప్రశ్న ఇప్పుడు CRDA పరిధిలో సందిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతుంది. దీనిపై ఈనెల 13వ తేదీన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామతో పాటు పల్నాడు జిల్లాలో ఉన్న పెదకూరపాడు నియోజకవర్గాన్ని కూడా అమరావతిలో కలుపుతారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Similar News
News March 15, 2026
కడప జిల్లా వ్యాప్తంగా 282 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనల పాటించని 282 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి రూ.58,340లు జరిమానాగా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలిపారు.
News March 15, 2026
అవనిగడ్డ జనసేన, టీడీపీలో ముసలం!

అవనిగడ్డ కూటమి నేతల్లో ముసలం మొదలైంది. కోడూరు TDP అధ్యక్షుడు బండే శ్రీను, MLA బుద్దప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రోడ్ల కాంట్రాక్ట్ విషయంలో ఈ వైరం ముదిరింది. మిగిలిన మండలాల్లో వర్గభేదాలు బయటపడనప్పటికీ జనసేన, TDP నేతల మధ్య గ్యాప్ కనిపిస్తోంది. త్వరలో TDP నియోజకవర్గ ఇన్ఛార్జ్ను నియమిస్తారనే ప్రచారం ఉంది. దీంతో MLA కాంపౌండ్ నుంచి ఇన్ఛార్జ్ దగ్గరికి TDP నేతలు షిఫ్ట్ అవుతారని టాక్.
News March 15, 2026
నావిక్కు అంతరాయం

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.


